రామగుండం కమిషనరేట్ మంచిర్యాల జిల్లా మంచిర్యాల ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో శ్రీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ IPS గారి ఆదేశాల మేరకు మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులు 7వ విడత హరితహరంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శిషుమందిర్ పాఠశాల యందు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీపి ఉదయ్ కుమార్ రెడ్డి గారు, మంచిర్యాల ఎసిపి అఖిల్ మహాజన్ IPS గారు, రామగుండం ట్రాఫిక్ ఎసిపి బాలరాజు గారు పాల్గొని మొక్కలు నాటారు, మరియు తమ ట్రాఫిక్ సిబ్బంది అందరితో మొక్కలు నాటించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 7 వ విడతలో మంచిర్యాల జిల్లా పోలీస్ శాఖ తరుపున ఒక లక్ష మొక్కలు నాటాలని సదుద్దేశంలో బాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో మొక్కలను నాటడం అయిందని
, మొక్కలు నాటడమే కాకుండా దాని బాధ్యత కూడా తీసుకోవాల్సిందిగా తమ సిబ్బందికి ఆదేశించారు.
ఇట్టి కార్యక్రమాలను ఏర్పాటు చేసిన ట్రాఫిక్ ఏసిపి బాలరాజు గారిని మరియు మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజు గారిని అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో ఎస్ ఐ విజయ్ కుమార్ మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.